Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Wednesday, May 25, 2011

'Telugu Talli' In ICU

YEAR-2162; MONTH-AUGUST; DATE-28;

The news of 'Telugu Talli'(Mother of all Telugu speaking people)getting admitted in hospital,created sensation across India.Few sympathized with her,while few people don't even know who she is.The very own children of 'Telugu' didn't even care about the news and wondered if they knew her!!
"Once upon a time in India,'Telugu' was the largest spoken language after Hindi","Telugu was known as Italian of the East","Telugu is the mother tongue of the state","There were many books written in Telugu language,Telugu writers were very famous and received many civilization honors"..these are the headlines in all the news channels about 'Telugu'.
The only Telugu medium school in the country,"Saraswathi Vidyalaya" with a strength of 5 students,offered prayers and wished for a speedy recovery of 'Telugu Talli'.

The PMO released a press statement with a note of the Prime Minister Smt.Indira Gandhi(Great Grand daughter of Sonia Gandhi) about 'Telugu Talli',....."Telugu is one of the greatest languages and it was recognized as one of the ancient/classical languages on 1st November,2008,by then UPA govt,headed by Smt.Sonia Gandhi.I wish her to have a long life and order the state govt to take necessary actions for the proper care and treatment of Telugu"..Prime Minister mentioned.

The hospital management and doctors treating 'Telugu Talli' released press statements every hour and said that her condition is stable,but couldn't guarantee her survival.

The cousins of telugu,namely 'Tamil','Marathi',..who are equally aged and are very healthy came to console their sister.

"Her condition is not at all hopeful,it all happened because of her children who didn't care her properly.I'm glad my children respect me,take very good care of  me,..that's the reason am so healthy and happy",.'Tamil' explained to the media after she visited 'Telugu Talli'.

Marathi also had the same words to say.."I agree with 'Tamil',Telugu was very much neglected by her own children,i feel sad about her.My children,especially,the successors of Bal Thackeray,take very good care of me and treat me like an angel,that's the reason am so happy,healthy and prosperous till date",..told 'Marathi Maatha' to the media.

The hospital management did not allow any more visitors as 'Telugu Talli' is not willing to meet anyone,after she met her cousins,'Tamil','Marathi',....they said!

When a reporter named karthikeya,approached the management to allow him to take an interview of telugu talli,they refused and said that she is not in a stage to speak.

On the same day,telugu talli insisted that she wants to speak to any of the media sources and want to express her feelings and convey some message to her children.
The hospital management immediately called karthikeya and permitted him to take an interview......
"Don't ask her stupid questions",they warned.

when karthikeya entered the room,..the site of 'Telugu Talli'moved him at once...she is on the bed lying with her eyes semi-closed,with saline to her hand and she looked very weak.

"welcome my boy,..thanks for coming",she wished him in a very low voice.
He greeted her too and said that he wants to ask her few questions.she asked him to go on...

karthikeya(KK):-"Even though,i belong to this state,i dont know telugu,can i take the interview in english,"..he expressed his helplessness.
Telugu Talli(TT):-"u can my son,i learnt to read,write and speak english for you all,"..she said in a soft voice.

KK:-Thank you,my 1st question,..do u have any complaints for anyone or do u want to make anyone responsible for ur present situation?
TT:-Absolutely,..No 

KK:-really??!!..okay!but your cousins say that Ur children like us,are responsible for your present condition..do u agree? 
TT:-yes,i do,..but i don't blame them completely..i should have taken care of myself,instead of depending on them for my survival...

KK:-what was Ur saddest day? 
TT:-Its when my siblings,..Telangana slang,Seema and Koasthandra Slangs,i.e.,23 dialects died.They were neglected and were degraded,few of my children,constantly insulted them and also the people who took care of them,..due to the humiliation,people stopped caring about them and at-last they died leaving me all alone.Few of them,then,thought i'am the only prominent "Telugu Language" as i was used in books widely,it was a great misconception and due to various other reasons like growing importance of English etc,i lost them,that was the saddest part in my life span,but i couldn't do anything about it then!

KK:-That's sad,...how about Ur happiest moment? 
TT:-"i still have 5 students worshipping me,it makes me happy even now",..she smiled gently! 

KK:-Cool...and Management said that you are not willing to meet anyone after u met your cousins,..why is that so? 
TT:-yes,i don't want to meet anyone,..all of them are blaming my children.Ive seen the press conference of Tamil and Marathi,felt bad for degrading my children.when they came to me,they were more sarcastic instead of consoling me.It hurts my self-respect.i didn't want that to continue.However,i can understand there love for me,..and am happy that my cousins are healthy and happy and hope there joy should continue forever.

KK:-okay,..i can see that Ur trying hard to breath and speak,..i don't want to trouble u more..do u have anything to say before i wind up? 
TT:-"yes,i want to tell all my children that am their mother,..a mother they never felt.i still love them,even if they don't love me.If i die tomorrow,i expect my children to remember me for at least once in a year and speak only Telugu on that day,take this as my last wish"...mother of Telugu's said,tears rolling down from her eyes....

Karthikeya soothed her,promised her that he will learn the language and made her smile for a while.He wished her a speedy recovery and left.

After reading the interview,people realized their mistake and are ashamed about themselves.Their concern for her mother tongue increased.
But,the doctors released a News Bulletin saying...."Telugu Talli",is shifted to ICU.Her condition is critical"!!!

                                                    *....................*...................*

నోట్ల నుండి తెలుగు భాష వస్తే అవమానం అని అనుకునేటోళ్ళను ,..తమ పిల్లలతో ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడించేటోళ్ళను,..తెలుగు భాష సక్కగా మాట్లాడలేని మన ప్రజా ప్రతినిధులను చూసినప్పుడూ....ముఖ్యంగా ఇంటర్ తెలుగులో 29,000ల మందికి "సున్నా" మార్కులు వచ్చినయ్ అనే వార్త చదివినప్పుడు కలిగిన ఒక విధమైన బాధ నుండి పుట్టినదే ఈ కథ....ఇప్పుడే ఇట్లుంటే,...150 సంవత్సరాల తరువాత "తెలుగు" పరిస్థితి ఎందో అని అనుకునప్పుడు కలిగిన ఆలోచన....

తెలుగు వాళ్ళం కదా..Englishలో రాస్తే బాగా అర్థం
అయితదని{ముఖ్యంగా ఈతరానికి},ఆ భాషలో రాసిన...!!
తెలంగాణా,కోస్తాంద్ర,సీమ,...యాస ఏదైనా భాష తెలుగే...."స్వచ్ఛమైన తెలుగు" మాదే అనేటోళ్ళను చెప్పు తీసుకొని కొట్టుండ్రి....మీ మీ బాష,యాసలలో మాట్లాడుటానికి గర్వపడుండ్రి......
పైన కథలో తెలుగులోని యాసలను చంపేసినందుకు క్షమించమని కోరుతున్నా!!తెలుగు
భాషకి,ఆ భాషలోని యాసలకీ అట్లాంటి దుర్ఘతి రావొద్దని,రాదని,రాకుడదని,..మనస్పూర్తిగా కోరుకుంటూ.....

Saturday, May 21, 2011

'కాళోజీ' కనిపిస్తలేరు

ఒకసారెప్పుడో బండి మీద పోవుకుంట,..ఇటు చూసిన,అటు చూసిన,....మా దోస్తు గాడు బండి తోలుతుంటే,..మెల్లంగ పొమ్మని చెప్పి మళ్ళ మళ్ళ చూసిన,.....ఏది?,.ఎక్కడ?,..33 విగ్రహాల నడుమ మన 'కాళన్న' విగ్రహం మాత్రం కానరాలే....."మహాకవి" కి ఉన్న గౌరవం "ప్రజాకవి" కి ఎందుకు లేదో అని అనుకున్నాను అప్పుడు!

2011 ,march 10 ,.ఎవరు,ఎందుకు అన్నది పక్కన పెడితే,..ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను కూలగొట్టిండ్రు.తెలుగు జాతి గౌరవం మంటగలిసిందనీ,ప్రజాస్వామ్యం అపహాస్యం అయినదనీ,మహనీయులకి అవమానం జరిగిందని...ఇట్లా ఎందరో మేధావుల వ్యాఖ్యల నడుమ మళ్ళ విగ్రహాలు పెట్టిస్తాం అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు.పాత విగ్రహాలే మల్ల పెడతం అన్నారు కానీ,..కొత్త విగ్రహాలు పెడుతం అన్న ముచ్చట మాత్రం చెప్పలే!

ఇంతకూ ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఉండాల్నంటే ఏం అర్హతలు కావల్నో నా అట్లాంటోల్లకి అర్థం కాలే..(మీకు తెలిస్తే,నాకు చెప్పుండ్రి).కొమరం భీం,కాళోజి వంటి వారి విగ్రహాలు పెట్టాల్నని కొందరు ప్రభుత్వానికి సూచించినా..పెద్దగ పట్టించుకున్నట్టు లేరు!

నిజంగా కాళోజి గారికి ట్యాంక్ బండ్  మీద విగ్రహం కావాల్నా..?
ఏ తెలుగు రాజకీయ నాయకుడికి,కవికి దక్కని,.కేంద్ర ప్రభుత్వం గౌరవించి ఇచ్చిన భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం "పద్మవిభూషణ్" చాలదా?
అంతకుమించి ప్రజలు ఇచ్చిన "ప్రజా కవి" బిరుదు చాలదా?అందరూ "కాళన్నా" అని పిలిచే పిలుపు చాలదా?
హనుమకొండలో ఆయన పేరు మీద ఉన్న "కాళోజి రోడ్",వరంగల్ లో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహం,"కాళోజి ఫౌండేషన్" పేరుతో ఆయన అభిమానులు చేస్తున్న సాహిత్య సేవ చాలవా?
        ఇన్ని గౌరవాలు దక్కిన ఆయనకు,రాజధాని లో విగ్రహం పెట్టుటానికి మాత్రం ఏ ప్రభుత్వానికీ దైర్యం రాలేదు ఎందుకో?ఇంతమంది ఇప్పుడు పెట్టుమని అడుగుతున్నా..ఇంకా దైర్యం వస్తలేదు ఎందుకోమరి..?!

కాళోజి అనంగానే,..తెలంగాణా ఉద్యమ కవితలకి మాత్రమే ప్రసిద్ధి అనే అపోహ కొందరికి ఉన్నది.అది ఎంత మాత్రం నిజం కాదు.ఆయన అప్పుడు రాసిన కవితలు ప్రస్తుత పరిస్థుతులకు కూడా అన్వయించుకోవచ్చు.దేశం లోని పేదల,సంపన్నుల స్వభావాలను తెలిపే ఈ కింది కవిత ఎన్ని సార్లు చదివితే,అన్ని సార్లు నాకు కొత్తగానే అనిపిస్తది..
"ఒకడు కుతికెల దాక మెక్కినోడు...
మరొకడు మింగ మెతుకు లేనోడు..
ఇద్దరికీ గొంతు పెకలదు,ఇద్దరికీ ఊపిరాడదు...ఒకే కారణం....'తినలేక',.."


తన సమకాలీకుడైన శ్రీశ్రీ మీద ఆయన షస్టి పూర్తి సభలో చదివిన ఈ కింది కవిత కాళోజి గారి చమత్కారానికి నిదర్శనం..
"నీవు రాసి పారేసిన కవితలు గుబాలిస్తున్నప్పుడు...
నువ్వు తాగి పారేసిన సీసాల కంపు మాకెందుకు?",..


అట్లనే నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి చర్యలకు స్పందిస్తూ....
" 'కాసు' ఆటలోని గుట్టు 'కాళోజి' కనిపెట్టు" అని రాసిండ్రు ఇంకోకాడ!


దేశం లోని అవినీతిని చూస్తూ నిస్సహాయంగా ఉన్న ఎందరో మనోభావాలకి అద్దం పట్టే ఇంకో కవిత...
"తప్పు దిద్దగా లేను,..దారి చూపగా లేను..
తప్పు చేసిన వాని దండిపగా లేను..
ఎందుకో నా హృదిని ఇన్ని వేదనలు.." అని ప్రతి హృదయాన్ని తాకినా మహానుభావుడు "కాళోజి".

ఇట్లాంటి ఆణిముత్యాలు ఎన్నో....

చివరకు 'సత్తుపల్లి' నియోజిక వర్గం నుండి పోటి చేసినప్పుడు కూడా....
"సత్తుపల్లి వోటర్ల సత్తువెంతో
తేలాలే.." అని వోటర్లలో చైతన్యం నింపిన 'కాళన్న'ను కాలం మరచిపోతుందా..?

తెలంగాణా బాష,యాస మీద ఉన్న చిన్న చూపును ప్రశ్నిస్తూ..
"వాక్యం లో మూడు పాళ్ళు...ఇంగిలీషు వాడుకుంట...
తెలంగానీయుల మాటల్లో ఉర్దూ పదం దోర్లగానే..హీ హీ...అని ఇగిలించెడి సమగ్రాంధ్ర వాదులను ఏమనవలేనో తోచదు..",..

ఈ కవిత ఏ తెలంగాణా వాడికి చెప్పినా....."ఎంత సత్యం చెప్పిండే" అనే అంటారు ఇప్పటికీ...

ఇని నిజాలు చెప్పినందుకేనేమో ఆయనంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత చిన్న చూపు!'కాళోజి'ని తెలంగాణా కవి గానే చూసే మూర్ఖులకి లెక్క లేదు....!

కాళోజి ఒక కవి,ఒక రాజకీయ నాయకుడు,ఒక సంఘసంస్కర్త,ఒక స్వాతంత్ర సమరయోధుడు,తామ్ర పత్ర గ్రహీత,ఒక అనువాదకుడు,..అన్నిటికీ మించి....."ప్రజల మనిషి"!!

తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ,హిందీ,మరాఠీ భాషల్లో ఆయన రాసిన కవితలు మస్తు ఉన్నాయ్.మరి ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాల్నంటే ఇంతకన్నా ఏం అర్హతలు కావల్నో?!
పాఠ్య పుస్తకాల్లో శ్రీశ్రీ గురించి,విశ్వనాథ సత్యనారాయణ గురించి చదువుకున్నాం గాని...'కాళోజి' గురించి గాని,ఆయన కవితల గురించి గాని ఎక్కడా,ఏ పాఠ్య పుస్తకాల్లోనూ రాయలేదు,...ఎందుకో?!

ట్యాంక్ బండ్ మీద విగ్రాహాలు పగులగొట్టిండ్రు అని లొల్లి చేసినోల్లలో సగానికి సగం మంది అయినా,.."కాళోజి" విగ్రహం ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించినప్పుడే..."అంతా తెలుగువారమే" అని వారు వాడే వాక్యానికి అర్థం ఉన్నట్టు!తెలుగు గౌరవాన్ని కాపాడినట్టు! మన తెలుగు చరిత్రని మన భావి తరాలకు అందించినట్టు.

"చంద్రునికో నూలుపోగు" అన్నట్టు...నిజానికి కాళోజి గారి విగ్రహం ఉన్నా,లేకపోయినా,..పెద్ద నష్టం లేదు..కాని ఆ మహనీయున్ని అధికారికంగా గౌరవించడం ప్రభుత్వ బాధ్యత,గుర్తుచేయటం ప్రతి తెలుగు వాడి బాధ్యత...!

"శ్రీశ్రీ" పూర్తి పేరు "శ్రీరంగం శ్రీనివాసరావు" అని తెల్వనోల్లు,..శ్రీకృష్ణదేవరాయులు ఎక్కడి రాజో కూడా తెల్వనోల్లు,శాసనసభ్యులు,మేధావులు,ఆంధ్రప్రాంత రచయతల సంఘాలు....అందరూ కట్ట కట్టుకొని విగ్రహాల కూల్చివేతను ఖండిచిన్నట్టు....'కాళోజి' విగ్రహం పెట్టుమని గట్టిగ చెప్పరాదా?నోరు లేవదా?ఇట్లాంటి సమగ్రాంధ్ర వాదులకు,వలస పాలకులకు,'తెలుగు వారంతా ఒక్కటే' అని రాస్క పూస్క తిరిగేటోల్లకు.........
"కాళోజి కనిపిస్తలేరు"!!{అది తెలుగు జాతి చేసుకున్న దౌర్బాగ్యం,దురదృష్టం!}

"దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాక తన్ని తరుముదాం,.." అన్న కాళోజి కవిత ఇట్లాంటప్పుడే గుర్తుకొస్తది...అట్లా యాదికొస్తే తప్పు నాదా?
 
ఇద్దరూ సమకాలికులే అయినప్పుడు..'ప్రజాకవి' కి లేని విగ్రహం 'మహాకవి'కి ఎందుకు?
'కాళోజి' ని అర్థం చేసుకోలేని తెలుగు వారెందుకు?
వారిని గౌరవించలేని 'తెలుగుతనం' నాకెందుకు?
ఒక మహనీయుడిని సక్కగ గౌరవించలేని "సమైక్య తెలుగు రాష్ట్రం" లో "తెలుగు వాడి" గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను...!!!

Saturday, May 14, 2011

జ్ఞాపకాలు: నేను-నా పిల్లలు


"అన్నా",.అని ఆ పిల్లలు వచ్చి పిలవంగానే ఒక రకమైన సంతోషం,చిరాకు,"అబ్బా...వచ్చిండ్రా..",అనే యాష్ట తో పాటు రెండు గంటలు నన్ను నేను మర్చిపోయి నా చిన్నప్పటి "నన్ను" చూసుకోవచ్చు అనే ఆనందం,..అన్ని భావనలూ కలిగేవి నాకు...

సరిగ్గా 5 గంటలకు నా 9 మంది పిల్లలు వచ్చి నా నెత్తి మీద నాట్యం చేయడానికి తయారు ఉండెటోల్లు (ఆ...ఆ....మీ వెకిలి నవ్వుకి అర్థం తెల్సింది గాని,..."నా పిల్లలు అంటే నేను tuitions చెప్పిన పిల్లలు అని").ఇచ్చట అన్ని రకాల వస్తువులు లబించును అన్న రీతిలో,..నా దగ్గర వచ్చే పిల్లల్లో ౩ ఏళ్ళ చిన్ని పాప నుండి 15 ఏళ్ళ బాబు వరకు అంతా ఉండేవారు.ఒక "complete package " లెక్క ఉండేటిది.

అసలు ఈ tuitions చెప్పుడు అన్న ఆలోచన నాకెప్పుడు లేదు.ఆ మాటకొస్తే మనకంత ఓపిక అసలే లేదు,మరి మనం "పరమ బద్ధక చక్రలం" కదా!
మా apartments లో మస్తు మంది పిల్లలు ఉండేవాళ్ళు.ఎప్పుడూ వాళ్ళ లొల్లి తో సందడిగా ఉండేది.మా watchmen భార్య ఆ పిల్లలందరినీ రోజూ తిట్టుడు,వాళ్ళు వినకుండా apartments లో ఇష్టం వచ్చినట్టు ఆడుకునుడు చాలా మామూలు విషయం అయిపొయింది.
ఒకరోజు బయట నుండి వస్తున్న నన్ను ఆపి,.ఆమె,.."బాబు నీకు పుణ్యం ఉంటది,జర మా వానికి సదువు చెప్పయ్యా,..ఏం సదువడు,ఒకటే ఆటల్ల వడ్డడు..."అని ఇంకా ఏదో అనబోతుంటే,.."సరే,ఎమన్నా doubts ఉంటే రమ్మను చెప్తా" అన్నాను.
"అట్లా కాదు బాబు,రోజుకో గంట చెప్పయ్యా,..బాంచన్"అంది.
మనకి మాత్రం అంత ముఖ్యమైన పనులేమ్మున్నాయని...గంటనే కదా.."సరే రమ్మను" అని చెప్పి ఒక బాబుకేనా,పాప కి వద్దా" అని అడిగిన.
"మా వోడు ప్రైవేటు బడి,పిల్లనేమో govt బడి,ఆడపిల్ల దానికెట్లైన ఎం లేదు గాని వీడే సదవాలే" అని అన్నది.
పంపితే ఇద్దరిని పంపు,..చదువుకు ఆడ,మగ ఏం లేదు,ఇద్దరికి చెప్తా అని చిన్న ఉపన్యాసం ఇచ్చి వచ్చేసిన.

ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఆ ఇద్దరు పిల్లలు పుస్తకాలు పట్టుకొని మా ఇంటికి వచ్చిండ్రు.బాబు 8వ తరగతి(ఇంగ్లీష్ మీడియం),పాప 5వ తరగతి(తెలుగు మీడియం),..కాని,మన బాబుకి ఆంగ్లము అరముక్క రాదు,..పాప కి వర్ణమాల అంటే ఏందో తెలవదు(5వ తరగతి కి ఎట్లా వచ్చిందో సర్కారు బడినే అడగాలి మరి!)..ఒప్పుకున్నాక తప్పుతుందా అనుకొని సమాధానపడ్డాను!

మర్నాడు సాయంత్రం ఆ ఇద్దరి పిల్లలతో పాటు ఇంకోడు వచ్చి చేరిండు."ఎవరు నువ్వు,ఎందుకు వచ్చినవ్",.అని అడుగుతుండగానే మా పక్క apartment watchmen వచ్చి..."వీడు నా కొడుకు బాబు,6th class చదువుతుండు,ఆ ఇద్దరితోనే వీనికి జర చెప్పయ్యా,.."అని బతిలాడి వెళ్లిపోయిండు.సరే చెప్దాం అనుకునప్పుడు ఇద్దరైతే ఏందీ,ముగ్గురైతే ఏందీ అని అనుకొని అతనికీ చెప్పడం మొదలుపెట్టిన.

మరి ఈ విషయం ఎట్లా తెల్సుకుందో గాని,..ఆ మర్నాడే మా పనిమనిషి మా అమ్మ తో "బాబుని మా పిల్ల కి గూడా tuition చెప్పమనమ్మ,.౩ క్లాసు చదువుతుంది,ఇవాళ పంపిస్తా"అని చెప్పింది.చిన్న పిల్లనే కదా,..పంపమని మా అమ్మ చెప్పుడు,..ఆ రోజు సాయంత్రం ఆ చిన్న పిల్ల నా దగ్గరికి వచ్చుడు జరిగిపోయినయ్!"చిన్న పిల్ల" నే కదా అని ఎంత తక్కువ అంచనా వేసిన్నో తర్వాత అర్ధం అయింది ఆ పిల్ల చేసే అల్లరితో.

ఈ నలుగురికి చెప్తుండగానే ఇంకో అతను వచ్చి వాళ్ళ ఇద్దరి పిల్లలను తిసుకొచ్చిండు.అసలు ఆ పిల్లలకి ఎం చెప్పాలి అనే సందేహం వచ్చింది నాకు,ఎందుకంటె అందులో ఒక పాప 1st class,ఇంకో పాప కి ౩ ఏళ్ళు.అంత చిన్న పాపకి ఎందుకు అని అడిగితే,.."వచ్చే ఏడాది స్కూల్ ల చేర్పిస్తం కదా,..కొంచం అలవాటు అయితదని,..నువ్వేం చెప్పకు బాబు,..ఒరికే కూసోనీ అంతే,..abcdలు పెట్టియ్ రాస్తది"అన్నాడు.ఆ పాప మస్తు ముద్దుగా,బొద్దుగా,తెల్లగా ఉండటంతో,..రోజు ఆడుకోవచ్చు కదా అని "సరే" అన్నాను.నేను ఎంత శ్రద్ధగా abcd లు పెట్టించేవాడినో,.దానిని అంతే శ్రద్ధగా తుడిపేసి,భక్తితో నాకు సమర్పించేది ఆ చిన్ని పాప!
ఒక 20 రోజుల తరువాత ఒక ముగ్గురు,..ఆ తరువాత మరో ఇద్దరూ,..అంతా కలిసి KG నుండి 10th క్లాసు దాక అందరూ వచ్చి చేరిండ్రు.
ఇట్లా గంట సేపు చెప్పే tuition సమయం,రెండు గంటలు చేయాల్సి వచ్చింది పిల్లలు పెరగటంతో.పెద్ద వాళ్ళకంటే చిన్న పిల్లలకి చెప్పటమే ఎక్కువ కష్టం అని అప్పుడు తెలిసింది.

చిన్న పిల్లలను పక్కన పెడితే,నా బుర్ర తినేటందుకు రోజు ఆరుగురు ఉండెటోల్లు.tuition మొదలైన పది నిమిషాలకే "అన్నా,..water,..","అన్నా,..urgent అన్నా,..ప్లీజ్ అన్నా,..","అన్నా,ఇవాళ మా స్కూల్ల టీచర్,..","అన్నా,..వీడు కొడుతుండన్నా....",..ఇట్లా రెండు గంటలు ఏదో ఒకటి చెప్పి,ఎట్లైనా చదువు తప్పించుకోవాలె అని చుసేటోల్లు.మొత్తానికి కష్టపడి వాళ్ళ homeworks చేయించి,చదివించి పంపించేటోడ్ని.

ఒకరోజు కొన్ని పదాలు notebookలో పెట్టించి "తొందరగా రాయి,లేకపోతే rub చేస్తా"అని అన్నాను ఒక పాపతో.అయిన కూడా మెల్లిగానే రాస్తుంది,మళ్లీ అట్లనే అన్నాను..వెంటనే,"ఇదేమన్న black board ఆ,..ఒరికే rub చేస్తా,rub చేస్తా అంటున్నావ్,ఇన్ని pages ఉన్నాయ్ చూడు,అందులో రాసుకోవచ్చు కదా"అని ఒక కౌంటర్ ఇచ్చింది.నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు!ఇట్లా ఏది మాట్లాడిన ఒక తింగరి సమాధానం తయారుగా ఉండేది మనోళ్ళ దగ్గర!ఇంకోసారి నాకు జ్వరం వచ్చి ఒక 4 రోజులు tuition చెప్పలేదు,..ఇంకా అప్పటినుండి నా "అనారోగ్యమే వాళ్ళ మహాభాగ్యం" అని అర్థం అయ్యి,.."అన్నా,..నీకు మళ్ళ జ్వరం ఎపుడు వస్తదన్నా,...",.."అన్నా,..వీడు నీకు జ్వరం వస్తే బాగుండు అంటుండన్నా...",..అని వాళ్ళ మనసులో కోరిక బయటపెట్టేటోల్లు.

ఇగ వాళ్ళ లొల్లిలు,వెకిలి నవ్వులు,నన్ను కావాలని అడిగే పిచ్చి ప్రశ్నలు,నేను ఎట్లైన కొట్టను అని తెలిసి నా దగ్గర గారాలు పోవుడు.....ఇట్లా హాయిగా గడిచిపోతున్న మా జీవితాల్లోకి తుఫాను లెక్క ఏప్రిల్ నెల వచ్చింది.పిల్లల parents వచ్చి,.."ఈ సారి మా వాడికి మంచి మార్కులు రావాలండి,..",.."ఈ సబ్జెక్టు లో చాలా weakగా ఉన్నాడు,ఎక్కువ చెప్పండి,.",..లాంటివి చెప్పిండ్రు,..నా శక్తీ మేరకు నేను కూడా కష్టపడ్డాను వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పడానికి,.....exams వాళ్ళకైతే tension నాకు ఎక్కువ ఉండేది!!

ఎప్పుడూ పుస్తకం ముట్టని ఒక బాబు,నేను చెప్పినదంతా చేయడం,చదవడం మొదలుపెట్టిండు.
"పరిక్షలు అనేవరకే ఇంత బుద్ధి వచ్చిందేంది" అని నేను అడిగితే,...
"నాకు ఎప్పుడూ 390 మార్కులు వస్తాయ్ అన్నా,..ఈ సారి 450 తెచ్చుకుంటే మా అమ్మ నాకు laptop కొనిస్తా అంది"అని అసలు విషయం చెప్పిండు మనోడు.
7th క్లాసు చదివే వాడు laptop ఏం చేసుకుంటాడో అర్థం కాలేదు కాని,..10th లో 500 కన్నా ఎక్కువ మార్కులు వస్తే సైకిల్ కొనిస్తా అన్న మా నాన్న మాటలు గుర్తొచ్చాయి నాకు(నాకు మార్కులు వచ్చినా,సైకిల్ రాలేదు,అది వేరే విషయం!).
ఇట్లా బహుమతుల కోసమో,నా భయం తోనో,వాళ్ల శ్రద్ధ తోనో మొత్తానికి పరిక్షలు అన్ని రాసేసి,నాకు సెలవులు ఇచ్చేసిండ్రు పిల్లలు.ఆఖరి రోజు అందరికి choclates ఇచ్చిన,..ఆ choclates తీసుకున్న మూడేళ్ళ పాప ఆనందంతో నన్ను చూసి నవ్విన నవ్వు,....నేను నా జీవితంలో మరచిపోలేను!!

ఒక 15 -20 రోజుల తరువాత నేను బయటకి వెళ్తుంటే,అక్కడే ఆడుకుంటున్న పిల్లలు..."అన్నా,నాకు 85 %,..వీనికి 75 % అంతే" అని ఒకడు,.."అన్నా,..నాకు mathsలో 95 ,వీడికి 65 అంతే"అని ఇంకొకడు అరవడం మొదలు పెట్టిండ్రు."నీకెన్ని వచ్చినయ్?" అని ఇంకొక బాబుని అడిగితే..."478 వచ్చినయి అన్నా..కానీ మా అమ్మ ఇంకా laptop తేలేదు"అన్నాడు."అమాయకుడా,.పెద్దోళ్ళ గురించి నీకేం తెలుసు" అని మనసులో అనుకున్నాను."అన్నా,..thanks అన్నా.."అని గట్టిగా అరిచి,ఉరికి పోయిండ్రు!!

అన్నిటికన్నా నాకు సంతోషం కలిగించే విషయం,..వర్ణమాలతో నా దగ్గర తెలుగు నేర్చుకునుడు ప్రారంబించిన అమ్మాయికి,..తెలుగు లో 64 మార్కులు రావడం.....ఈ విషయంలో కొంచం గర్వ పడతాను కూడా......ప్చ్....అదో తుత్తి.....!!!!!